• Home
  • Andhra Pradesh
  • గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్ పర్యటన – అధికారులు, వైసీపీ నేతల మధ్య వివాదం…!!
Image

గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్ పర్యటన – అధికారులు, వైసీపీ నేతల మధ్య వివాదం…!!

గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్ పర్యటన – అధికారులు, వైసీపీ నేతల మధ్య వివాదం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు. జగన్ రాకతో మిర్చి యార్డులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు జగన్ మిర్చిని పరిశీలించి, రైతులతో చర్చించనున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన జగన్, తన అనుచరులతో కలిసి మిర్చి యార్డుకు చేరుకున్న సమయంలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అనుమతి లేకుండా జగన్ పర్యటన కొనసాగడం వివాదాస్పదంగా మారింది.

మిర్చి యార్డు అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నందున ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాజకీయ సమావేశాలు నిషేధమని ప్రకటిస్తూ మైక్‌లో అనౌన్స్‌మెంట్లు కూడా ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీంతో వైసీపీ నేతలు స్పందిస్తూ, జగన్ ఎలాంటి రాజకీయ సభ నిర్వహించరని, కేవలం మిర్చి రైతులతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చారని తెలిపారు. అయితే, పోలీసులు ఎన్నికల కోడ్ కారణంగా జగన్ పర్యటనపై దూరంగా ఉన్నారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply