• Home
  • Andhra Pradesh
  • విశాఖ ఉక్కు బలోపేతం – సీఎం చంద్రబాబు కీలక చర్చలు…!!
Image

విశాఖ ఉక్కు బలోపేతం – సీఎం చంద్రబాబు కీలక చర్చలు…!!

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు! విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఉన్నతాధికారుల బృందం అమరావతిలో సీఎం చంద్రబాబును కలుసుకుని కీలక చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రివైవల్ ఫండ్ సద్వినియోగం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు సామర్థ్యం పెంచే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలో స్టీల్ ప్లాంట్ భద్రతకు SPF బలగాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం ఉన్న రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లతో పాటు మూడో ఫర్నేస్‌ను తిరిగి ప్రారంభించేందుకు చర్చలు జరిగాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ, కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Releated Posts

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…

ByByVedika TeamApr 17, 2025

పసిడి పరుగులు: గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా – ఈ ఏడాది చివరికి రూ.1.25 లక్షలు!

పసిడి పరుగులు పెడుతోంది. కేవలం మూడు అడుగుల దూరంలో లక్ష రూపాయల మార్కు కనిపిస్తోంది. ‘గోల్డ్‌ రేట్లు తగ్గుతాయి’ అని భావించినవారి అంచనాలను బంగారం…

ByByVedika TeamApr 16, 2025

75వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు కుటుంబంతో విదేశీ పర్యటన…!!

ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి ఓ ప్రత్యేక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.…

ByByVedika TeamApr 16, 2025

Leave a Reply