విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం “కింగ్డమ్”, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం మే 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్గా విడుదలైన టీజర్కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాపై హైప్ను పెంచింది. తమిళంలో సూర్య, హిందీలో రణ్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడారు.
“మీరు ఎంత ఊహించుకున్నా, “కింగ్డమ్” ఆ అంచనాలను మించి ఉంటుంది. కథ, లాజిక్స్, అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేశాం. ఎవరైనా ఏ డౌట్ అడిగినా నేనూ, గౌతమ్ తిన్ననూరి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.
కేజీయఫ్తో పోలికల గురించి అడిగిన ప్రశ్నకు
“కేజీయఫ్ బ్యాక్డ్రాప్తో మా సినిమాకు సంబంధం లేదు, కానీ యాక్షన్ సీక్వెన్స్, డ్రామా మాత్రం అంతకంటే పవర్ఫుల్గా ఉంటుంది” అని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ స్పెషల్ హైలైట్
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పారు.
“డైరెక్టర్ స్పాట్లో లేరు, కానీ కంటెంట్ నచ్చడంతో ‘నువ్వున్నావ్ కదా.. చెప్పేద్దాం పద’ అంటూ ఎన్టీఆర్ ఎనర్జీగా వాయిస్ ఓవర్ ఇచ్చారు” అని గుర్తుచేసుకున్నారు.
ప్యాన్ ఇండియా హిట్కు విజయ్ దేవరకొండ రెడీ
“ఫ్యామిలీ స్టార్” అనుకున్నంత పెద్ద విజయం సాధించకపోవడంతో, ఈసారి బ్లాక్బస్టర్ అందుకోవాలనే కసితో విజయ్ దేవరకొండ కింగ్డమ్కు సీరియస్గా వర్క్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మన రౌడీ హీరో, స్టోరీ సెలెక్షన్లో కొత్తదనం చూపిస్తూ ప్యాన్ ఇండియా హిట్ కోసం మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
🚀 మే 30న కింగ్డమ్ థియేటర్లలో – రెడీ అవ్వండి!