• Home
  • Andhra Pradesh
  • వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి పునఃప్రారంభం..!!
Image

వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి పునఃప్రారంభం..!!

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా, ఢిల్లీ పెద్దలతో సమావేశాలైనా శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోలు, ప్రసాదాన్ని వెంట తీసుకెళ్లడం ఆయనకు పరిపాటిగా మారింది. ఎందుకంటే, ఏ పని తలపెట్టినా శ్రీవారి ఆశీస్సులతో సక్సెస్ అవుతాననే నమ్మకంతో చంద్రబాబు ఉండటమే కారణం.

ఇప్పుడు మరోసారి చంద్రబాబు తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అమరావతి అభివృద్ధికి మళ్లీ శ్రీకారం చుట్టిన చంద్రబాబు, పనుల పునఃప్రారంభానికి ముందు తిరుమల శ్రీవారిని ఆశ్రయిస్తున్నారు.


అమరావతిలోని ముళ్ల కంపలు, చెట్లు, చెదారాన్ని తొలగించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు, అభివృద్ధి పనులకు శ్రీనివాస కల్యాణంతో శుభారంభం చేయబోతున్నారు. రేపు టీటీడీ ఆధ్వర్యంలో అమరావతిలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమరావతి రైతులను టీటీడీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.

శ్రీనివాస కల్యాణం అనంతరం ఏప్రిల్ రెండో వారంలో అమరావతి అభివృద్ధి పనులు పునఃప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక మోదీ కూడా అమరావతికి వచ్చి పనులను ప్రారంభించనున్నారు.

గతంలో కూడా చంద్రబాబు ఏ పని చేసినా ముందు శ్రీవారిని దర్శించుకుని, ఆయన ఆశీస్సులతో ముందుకు సాగేవారు. ఇప్పుడు మరోసారి శ్రీవారి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.

Releated Posts

విశాఖ జీవీఎంసీ పీఠంపై కూటమి జెండా: 74 ఓట్లతో అవిశ్వాసం విజయం..!!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. అధికార కూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి, మేయర్ హరి వెంకట కుమారిపై…

ByByVedika TeamApr 19, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply