• Home
  • Andhra Pradesh
  • వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి పునఃప్రారంభం..!!
Image

వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి పునఃప్రారంభం..!!

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా, ఢిల్లీ పెద్దలతో సమావేశాలైనా శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోలు, ప్రసాదాన్ని వెంట తీసుకెళ్లడం ఆయనకు పరిపాటిగా మారింది. ఎందుకంటే, ఏ పని తలపెట్టినా శ్రీవారి ఆశీస్సులతో సక్సెస్ అవుతాననే నమ్మకంతో చంద్రబాబు ఉండటమే కారణం.

ఇప్పుడు మరోసారి చంద్రబాబు తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అమరావతి అభివృద్ధికి మళ్లీ శ్రీకారం చుట్టిన చంద్రబాబు, పనుల పునఃప్రారంభానికి ముందు తిరుమల శ్రీవారిని ఆశ్రయిస్తున్నారు.


అమరావతిలోని ముళ్ల కంపలు, చెట్లు, చెదారాన్ని తొలగించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు, అభివృద్ధి పనులకు శ్రీనివాస కల్యాణంతో శుభారంభం చేయబోతున్నారు. రేపు టీటీడీ ఆధ్వర్యంలో అమరావతిలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమరావతి రైతులను టీటీడీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.

శ్రీనివాస కల్యాణం అనంతరం ఏప్రిల్ రెండో వారంలో అమరావతి అభివృద్ధి పనులు పునఃప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక మోదీ కూడా అమరావతికి వచ్చి పనులను ప్రారంభించనున్నారు.

గతంలో కూడా చంద్రబాబు ఏ పని చేసినా ముందు శ్రీవారిని దర్శించుకుని, ఆయన ఆశీస్సులతో ముందుకు సాగేవారు. ఇప్పుడు మరోసారి శ్రీవారి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply