వెంకటేష్: నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.. వెంకటేష్ ఎమోషనల్ వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఆహాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సూపర్ హిట్ టాక్ షో ప్రస్తుతం సీజన్ 4 లో సందడి చేస్తోంది. ఈ సీజన్లో స్టార్ హీరోలు, డైరెక్టర్లు గెస్ట్లుగా హాజరై అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా విక్టరీ వెంకటేష్ గెస్ట్గా హాజరై బాలయ్యతో కలిసి షోను మరింత రంజుగా మార్చారు. బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు అడిగి, ఆటపట్టిస్తూ, గేమ్స్ ఆడిస్తూ అలరించారు. ఈ ఎపిసోడ్లో వెంకటేష్ పర్సనల్ జీవిత విశేషాలను, తన కుటుంబం గురించి మాట్లాడటం విశేషం.
రామానాయుడు గురించి ఎమోషనల్ వెంకటేష్
ఈ ఎపిసోడ్లో వెంకటేష్ తన తండ్రి, దిగ్గజ నిర్మాత రామానాయుడు గారి చివరి రోజుల గురించి గుర్తుచేసుకున్నారు. ఆయన సినిమాలపైన ఎంత ప్రేమ ఉందో, చివరి రోజుల్లో కూడా ఒక స్క్రిప్ట్పై ఆసక్తి చూపి, తనతో కలిసి నటించాలని కోరారని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆ సినిమా చేయలేకపోవడం తనకు బాధగా ఉందని వెంకటేష్ వెల్లడించారు.
సురేష్ బాబు స్పందన
వెంకటేష్తో పాటు సురేష్ బాబు కూడా షోలో పాల్గొని రామానాయుడు గారి వ్యక్తిత్వం, వారు చేసిన త్యాగాలను వివరించారు. “నాన్న మంచి చేసినా ఎంపీగా ఓడిపోయాను అని బాధపడ్డారు. వెంకీతో సినిమా చేయలేకపోయానని కూడా విచారం వ్యక్తం చేశారు” అంటూ సురేష్ బాబు కన్నీరు పెట్టుకున్నారు.
ఇక ఈ ఎమోషనల్ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకటేష్, సురేష్ బాబు వ్యాఖ్యలు ప్రేక్షకుల హృదయాలను తడిచాయి.