• Home
  • Andhra Pradesh
  • మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
Image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఈ నెల 20న వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉంది.

పటమట పోలీసులు వంశీపై BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్‌, హత్యాయత్నం, బెదిరింపు వంటి మరికొన్ని కేసులు కూడా వంశీపై పెట్టారు. వంశీ అరెస్టుకు సంబంధించి ఆయన భార్యకు పటమట పోలీసులు నోటీస్ ఇచ్చారు.

కేసులో అనూహ్య మలుపు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్, ఇటీవల కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్థన్ హఠాత్తుగా పిటిషన్ విత్‌డ్రా చేసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనిపై అతను బెదిరింపులకు గురయ్యాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ కేసులో ఇవాళ కోర్టులో విచారణ జరగనుండగా, ఇదే సమయంలో హైదరాబాద్‌లో వంశీ అరెస్ట్ కావడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులోనే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply