• Home
  • Telangana
  • హైకోర్టు స్టే: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 నియామకాలపై తాత్కాలిక ఆదేశాలు…!!
Image

హైకోర్టు స్టే: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 నియామకాలపై తాత్కాలిక ఆదేశాలు…!!

హైదరాబాద్, ఏప్రిల్ 18:
తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు కొత్త మలుపు తిప్పాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది.

2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ, సిద్ధిపేటకు చెందిన కె. పర్శరాములుతో పాటు మరో 19 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ సమాధాన పత్రాలు సరిగా మూల్యాంకించలేదని, జనరల్ ర్యాంక్ జాబితా తప్పుగా విడుదలయ్యిందని ఆరోపించారు. తీవ్రత దృష్ట్యా కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలంటూ కోరారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనల్లో, హైదరాబాద్‌లోని రెండు సెంటర్ల నుంచి 71 మంది ఎంపిక కావడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. మొత్తం 563 పోస్టుల్లో ఇది 12% కి సమానమని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యలో మార్పులు, ఉర్దూ అభ్యర్థుల గణాంకాల్లో గందరగోళం, రీకౌంటింగ్‌లో మార్కుల తేడాలు వంటి అంశాలను ప్రస్తావించారు.

ఇక కమిషన్ తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదిస్తూ, ఒక్కో సెంటర్‌లో 4-5% మంది మాత్రమే ఎంపికయ్యారని, అవకతవకలు జరిగి ఉంటే ఎక్కువ మంది ఎంపిక కావాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్ కేసులో అభ్యర్థి ఫోర్జరీ చేసినట్లు తేలిందని, అతనికి షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, నియామక పత్రాలు ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరగనుంది.

Releated Posts

“నన్నే టార్గెట్ చేస్తారా?” – స్మితా సబర్వాల్ స్పందన వైరల్

కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో, రీట్వీట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు…

ByByVedika TeamApr 19, 2025

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల – ఇంటర్ బోర్డు ప్రకటన

తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11…

ByByVedika TeamApr 19, 2025

IPL 2025 ఫిక్సింగ్ ఆరోపణలపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన 34 మ్యాచ్‌ల అనంతరం ఢిల్లీ జట్టు…

ByByVedika TeamApr 19, 2025

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడవిని రక్షించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply