• Home
  • Telangana
  • తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025: ఈ తేదీన విడుదల.. విద్యార్థులకు కీలక అప్డేట్!

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025: ఈ తేదీన విడుదల.. విద్యార్థులకు కీలక అప్డేట్!

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మార్చి 30న సెలవులు ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని TSBIE స్పష్టం చేసింది.

అంతేకాకుండా, వేసవి సెలవుల్లో అనధికారికంగా క్లాసులు నిర్వహించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి క్లాసులు నిర్వహించినట్లు తెలిస్తే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

విద్యార్థులు ఈ సమయాన్ని స్వీయ అధ్యయనం, స్కిల్ డెవలప్మెంట్ కోసం వినియోగించుకోవాలని TSBIE సూచనలు చేసింది. జూన్ 2 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది.

ఇంకా, ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ వేగంగా సాగుతోంది. ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలు విడుదల చేయడానికి TSBIE ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పూర్తి పారదర్శకతతో సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుండగా, అంచనాల ప్రకారం ఈ నెలాఖరుకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Releated Posts

తెలంగాణలో సబ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు వేగవంతం – స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభం….!!

రిజిస్ట్రేషన్ ఇక వేగంగా, పారదర్శకంగా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వేగవంతమైన, సులభమైన, అవినీతిరహిత సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధునీకరణ చేపట్టింది.…

ByByVedika TeamApr 8, 2025

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..!!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8: 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ద్వంద్వ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా…

ByByVedika TeamApr 8, 2025

కంచ గచ్చిబౌలి వివాదం: విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, ఫేక్ వీడియోలపై నోటీసులు…

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ…

ByByVedika TeamApr 8, 2025

పేద ఇంటి వంటకం ఆస్వాదించిన సీఎం – సన్నబియ్యం పథకంపై ప్రత్యక్ష ఫీడ్‌బ్యాక్..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి, సామాన్యుడిలా మారిపోయారు.…

ByByVedika TeamApr 7, 2025

Leave a Reply