• Home
  • Telangana
  • ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ – కీలక అంశాలపై చర్చ…!!
Image

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ – కీలక అంశాలపై చర్చ…!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీను కలిశారు. ఈ భేటీలో SLBC టన్నెల్ సహాయక చర్యలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల జాబితా మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఐదు కీలక అంశాలపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందించారు.

రేవంత్ రెడ్డి వినతులు

  1. హైదరాబాద్ మెట్రో ఫేజ్ – 2 కోసం రూ.22,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి.
  2. రీజనల్ రింగ్ రోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలని అభ్యర్థన.
  3. డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే & రైల్వే లైన్ నిర్మాణం.
  4. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం నిధుల మంజూరు.
  5. 27 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయడంతో పాటు వరద నియంత్రణ చర్యల కోసం నిధులు కేటాయించాలని కోరారు.

ప్రధాని మోదీ సూచనలు

  • 2017-2022 మధ్య పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు.
  • ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన (గ్రామీణ) అమలు కోసం 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తిచేసి అర్హులను గుర్తించాలి.
  • శంషాబాద్ ESI ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.150 కోట్లు విడుదల చేయాలని తెలిపారు.
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం మూడు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.
  • బీబీనగర్ AIMMSకి నీటి & విద్యుత్ సరఫరా కోసం రూ.1,365.95 కోట్లు మంజూరు చేయాలని సూచించారు.
  • రైల్వే ప్రాజెక్టులకు అటవీ అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
  • మూడు నీటి పారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించి పంపాలని మోదీ సూచించారు.

ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Releated Posts

“నన్నే టార్గెట్ చేస్తారా?” – స్మితా సబర్వాల్ స్పందన వైరల్

కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో, రీట్వీట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు…

ByByVedika TeamApr 19, 2025

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల – ఇంటర్ బోర్డు ప్రకటన

తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11…

ByByVedika TeamApr 19, 2025

IPL 2025 ఫిక్సింగ్ ఆరోపణలపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన 34 మ్యాచ్‌ల అనంతరం ఢిల్లీ జట్టు…

ByByVedika TeamApr 19, 2025

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడవిని రక్షించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply