• Home
  • Andhra Pradesh
  • తెలంగాణ, ఏపీలో వడగండ్లు, ఉరుములు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
Image

తెలంగాణ, ఏపీలో వడగండ్లు, ఉరుములు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

మరత్వాడ, విదర్భ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, ఏపీలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణలో నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో నిన్న (సోమవారం) నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు:
  • ఆదిలాబాద్ – 41.8°C
  • నిజామాబాద్ – 40.4°C
  • మెదక్ – 40.2°C
  • భద్రాచలం – 39.8°C
  • రామగుండం – 38.8°C
  • మహబూబ్ నగర్ – 38.6°C
  • హైదరాబాద్ – 38.5°C
  • ఖమ్మం – 38.4°C
  • నల్లగొండ – 38°C
  • హనుమకొండ – 37.5°C
ఏపీలో వాతావరణ పరిస్థితి:
  • మంగళవారం శ్రీకాకుళం (6), విజయనగరం (6), పార్వతీపురం మన్యం (10), అల్లూరి సీతారామ రాజు (3), తూర్పుగోదావరి (1) జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుంది.
  • బుధవారం 28 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
  • గురువారం రాయలసీమ, శుక్రవారం ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు:
  • నంద్యాల (గోస్పాడు) – 40.3°C
  • కర్నూలు (కమ్మరచేడు) – 40.2°C
  • అనంతపురం (నాగసముద్రం) – 40°C
  • వైఎస్సార్ (గోటూరు) – 39.9°C
  • అనకాపల్లి (రావికమతం) – 39.7°C
  • మన్యం (జియ్యమ్మవలస) – 39.6°C

వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2-4°C తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Releated Posts

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

తెలంగాణ టెన్త్ ఫలితాలు త్వరలో విడుదల – మార్కుల విధానం, మెమోలపై తర్జనభర్జన….!!

హైదరాబాద్‌, ఏప్రిల్ 17:రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రేడింగ్…

ByByVedika TeamApr 17, 2025

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…

ByByVedika TeamApr 17, 2025

పసిడి పరుగులు: గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా – ఈ ఏడాది చివరికి రూ.1.25 లక్షలు!

పసిడి పరుగులు పెడుతోంది. కేవలం మూడు అడుగుల దూరంలో లక్ష రూపాయల మార్కు కనిపిస్తోంది. ‘గోల్డ్‌ రేట్లు తగ్గుతాయి’ అని భావించినవారి అంచనాలను బంగారం…

ByByVedika TeamApr 16, 2025

Leave a Reply