• Home
  • Telangana
  • తెలంగాణ టెన్త్ ఫలితాలు త్వరలో విడుదల – మార్కుల విధానం, మెమోలపై తర్జనభర్జన….!!
Image

తెలంగాణ టెన్త్ ఫలితాలు త్వరలో విడుదల – మార్కుల విధానం, మెమోలపై తర్జనభర్జన….!!

హైదరాబాద్‌, ఏప్రిల్ 17:
రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కుల ప్రకారమే ఫలితాలు ఇవ్వనున్నట్టు జీఓ జారీ చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 15తో ముగిసింది. ఫలితాలను రేపో మాపో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే టెన్త్ మెమోలు ఎలా ముద్రించాలన్న అంశంపై విద్యాశాఖ ఇంకా తర్జనభర్జనలో ఉంది. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతే ఫలితాల విడుదలకు మార్గం సుగమమవుతుంది.

ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానం ప్రకారం ఫలితాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ మార్కుల ఆధారంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అంటూ ముద్రించాలన్న ఆలోచనలో ఉంది. 35 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు “ఫెయిల్” అని ముద్రించనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఫలితాల విడుదల ఆలస్యం కావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు, మార్కుల విధానం వల్ల కార్పొరేట్ పాఠశాలలు దుర్వినియోగానికి పాల్పడతాయని, విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో నవంబర్ 2024లోనే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి, 20 మార్కులకు ఇంటర్నల్‌ మార్కులు కొనసాగిస్తామని తెలిపింది. అయితే ఇవి 2025-26 విద్యా సంవత్సరానికి తొలగించే అవకాశం ఉంది.

Releated Posts

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడవిని రక్షించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని…

ByByVedika TeamApr 18, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

హైకోర్టు స్టే: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 నియామకాలపై తాత్కాలిక ఆదేశాలు…!!

హైదరాబాద్, ఏప్రిల్ 18:తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు కొత్త మలుపు తిప్పాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.…

ByByVedika TeamApr 18, 2025

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply