టాలీవుడ్లో ప్రస్తుతం కుర్ర హీరోలు సూపర్ హిట్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా, చిన్న సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు, కుర్ర హీరోలు కంటెంట్ పరంగా సినిమాలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ లిస్ట్లో భాగమైన సందీప్ కిషన్ తన కెరీర్లో కొత్త దిశలో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నాడు.
సందీప్ కిషన్, టాలీవుడ్లో దాదాపు 15 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరో. “స్నేహగీతం” సినిమాతో పరిచయమైన ఈ యంగ్ హీరో, “ప్రస్థానం” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత “రొటీన్ లవ్ స్టోరీ” మరియు “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు పొందాడు.

అయితే, సందీప్ కి సరైన బ్రేక్ రాలేదు. గత ఏడాది “ఊరుపేరు భైరవకోన” చిత్రం మంచి టాక్ సంపాదించగా, “రాయన్” సినిమాలో ధనుష్ తమ్ముడిగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం, తన తదుపరి సినిమా “మజాకా”తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు “త్రినాద్ రావు నక్కిన” దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ రిలీజ్ సమయంలో సందీప్ మాట్లాడుతూ, “నన్ను లోకల్, హలో గురు ప్రేమకోసమే సినిమాలు చేయాల్సినవి. కానీ లాస్ట్ మినిట్ లో అలా జరిగాయి,” అని వెల్లడించాడు.