• Home
  • Andhra Pradesh
  • పర్యాటకానికి, పరిశ్రమలకు బూస్ట్… రైల్వే ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు శుభవార్త!
Image

పర్యాటకానికి, పరిశ్రమలకు బూస్ట్… రైల్వే ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు శుభవార్త!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. రేణిగుంట – కాట్పాడి రైల్వే మార్గాన్ని డబుల్ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 1,332 కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఈ డబ్లింగ్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు భారీ లాభాలు చేకూరుతాయని ఆయన పేర్కొన్నారు. దూరం తక్కువ అయినప్పటికీ ఈ మార్గం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా మంత్రి వివరించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడులోని వెల్లూరు వరకు ప్రయాణించే వారికి ఇది కీలక మార్గమవుతుంది.

ఈ ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు గణనీయంగా తోడ్పడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. తిరుపతి – పాకాల – కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండూ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా మారనుంది.

Releated Posts

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply