ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సోమవారం జరిగిన 20వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉత్కంఠత భరితమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (MI)పై 13 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 2015 తర్వాత అంటే 3620 రోజుల తర్వాత వాంఖడే స్టేడియంలో బెంగళూరు జట్టు మళ్లీ గెలుపు రుచి చూసింది. ఈ విజయం ద్వారా RCB పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది.

ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 67 పరుగులతో మెరిశాడు, కెప్టెన్ రజత్ పాటిదార్ 64 పరుగులతో ఆకట్టుకోగా, జితేష్ శర్మ అజేయంగా 40 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 37 పరుగులు తోడిచాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు, విఘ్నేష్ పుత్తూర్ ఒక వికెట్ పడగొట్టాడు.
222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. చివరి వరకు పోరాడిన ముంబై, బెంగళూరుకు మాత్రం కాస్త వడ్డీతోనే ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
ఇరు జట్ల ప్లేయింగ్ 11
ముంబై ఇండియన్స్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్
ఇంపాక్ట్ ప్లేయర్: రోహిత్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ