• Home
  • Andhra Pradesh
  • అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం త్వరలో – నారా లోకేష్
Image

అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం త్వరలో – నారా లోకేష్

బుధవారం సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాబోయే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన లోకేష్, పాక్‌ను ఎదుర్కొనే ప్రధానమంత్రి మోదీకి తమ కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. “మన కోరికలు నెరవేరిస్తున్న ప్రధాని మోదీ” అని ప్రశంసించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నమని, అమరావతి నిర్మాణం విషయంలో కేంద్రం సహకరిస్తోందని గుర్తుచేశారు.

గత పదినెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని లోకేష్ తెలిపారు. వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000, రోగులకు రూ.15000 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ, జూన్‌లో కొత్త పెన్షన్ దరఖాస్తులు, జులైలో పంపిణీ ప్రారంభం అవుతుందని వివరించారు.

అంజిరెడ్డి, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలం అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి తాగునీరు అందించే కృషి చేస్తున్నారని తెలిపారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply