మోదీ-ట్రంప్ భేటీ: వాణిజ్య, వీసా, డిపోర్టేషన్ కీలక అంశాలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య 118 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. భారత్ అమెరికాకు చేసిన ఎగుమతులు దిగుమతుల కంటే 32 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ గతంలో అనేక సార్లు విమర్శించారు.

ఇలాంటి సమయంలో అమెరికా ప్రధాన వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక భేటీకి సిద్ధమయ్యారు. వీరిద్దరూ పరస్పరం “ఫ్రెండ్” అని పిలుచుకునే నేపథ్యంలో ఈ సమావేశంపై ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
డిపోర్టేషన్పై ట్రంప్ ఆగ్రహం
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ పాలసీ పై తీవ్ర చర్యలు చేపడుతున్నారు. అక్రమంగా అమెరికాలో ఉన్న ఇండియన్ మైగ్రెంట్స్ లక్ష్యంగా మారారు.
- అమెరికాలో 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉన్నారని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
- అందులో 18,000 మందిని రౌండప్ చేసి ఇప్పటికే 104 మందిని ఇండియాకు పంపారు.
- ఒక్కొక్కరిని డిపోర్ట్ చేయడానికి 4 లక్షల డాలర్లు ఖర్చు పెట్టి టెక్సాస్ నుండి అమృత్సర్కు మిలిటరీ విమానాల్లో పంపించారు.
వీసా నిబంధనలు కఠినతరం
ట్రంప్ ప్రభుత్వం H1B వీసా పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.
- H1B వీసాను భారీ వేతనాలు పొందుతున్నవారికే పరిమితం చేయాలని నిర్ణయం.
- ఏటా 75,000 వీసాలు మాత్రమే మంజూరు చేయాలని ప్రతిపాదన.
- F1, M1 విద్యా వీసాలపై కొత్త నియమాలు.
వాణిజ్య సంబంధాల భవిష్యత్
అమెరికా భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నదని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని కూడా పేర్కొన్నారు.
ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా భారత దిగుమతులపై అమెరికా విధించే సుంకాల అంశం ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.
మొత్తంగా…
ఈ భేటీ అత్యంత కీలకమైనదిగా మారింది. మోదీ-ట్రంప్ భేటీ అనంతరం భారతీయుల డిపోర్టేషన్, వాణిజ్య నిబంధనలు, వీసా రూల్స్ పై కీలక ప్రకటనలు వచ్చే అవకాశముంది. మరి ఇద్దరు మిత్రులు ఏమి నిర్ణయిస్తారో వేచిచూడాలి!