మోదీ-ట్రంప్ భేటీ: స్నేహబంధం, చర్చాంశాలు, ఆసక్తికర విషయాలు
ఇద్దరు దేశాధినేతలు – జాన్ జిగ్రీ దోస్తులు! ఎప్పుడూ మంచి మిత్రులమని పరస్పరం పొగిడుకుంటూ, చేయి చేయి కలిపి ముందుకు సాగాలని చెబుతూ ఉంటారు. అలాంటి బంధువులు మరోసారి కలుసుకోబోతున్నారు. ఇంతకీ ఆ దేశాధినేతలు ఎవరు? వాళ్ల మధ్య ఉన్న స్నేహబంధం ఏమిటి? ఈ సమావేశంలో చర్చించనున్న అంశాలేమిటి?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీతో కలిసే ఇది తొలి సమావేశం. ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా హాట్ టాపిక్గా మారింది.
ట్రంప్-మోదీ స్నేహం:
ట్రంప్కి సాధారణ దౌత్య సంబంధాలకన్నా మోదీపై ప్రత్యేక అభిమానం ఉంది. భారత్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మోదీతో తన బలమైన అనుబంధాన్ని చెబుతుంటాడు. 2017లో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే వైట్ హౌస్లో విందుకు ఆహ్వానించిన తొలి విదేశీ నాయకుడు మోదీయే.
ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ అతనికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండో-పసిఫిక్ భద్రత, ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ట్రంప్ కూడా మోదీని ఎక్స్లో తన మిత్రుడిగా పేర్కొంటూ, అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
2019లో టెక్సాస్లో జరిగిన “హౌడీ మోదీ” కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని, మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ట్రంప్ 2020లో కుటుంబంతో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. అహ్మదాబాద్లో భారీ స్థాయిలో ట్రంప్కు స్వాగతం లభించింది. ఈ సంఘటనలను ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనూ ఉపయోగించుకున్నారు.
భేటీలో చర్చించనున్న కీలక అంశాలు:
- అక్రమ వలసదారులు & హెచ్1బీ వీసాలు:
- అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన భారతీయులను తిరిగి పంపిన ఘటనల నేపథ్యంలో, ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
- హెచ్1బీ వీసాలపై నిబంధనలు కఠినతరం కాకుండా చూడాలని మోదీ కోరే అవకాశం ఉంది.
- వ్యాపార సంబంధాలు & పన్ను రాయితీలు:
- భారత్-అమెరికా మధ్య వ్యాపార ఒప్పందాలు, టారిఫ్ రాయితీల గురించి చర్చించే అవకాశం ఉంది.
- భౌగోళిక రాజకీయాలు & భద్రత:
- ఇండో-పసిఫిక్ భద్రత, పశ్చిమాసియా, ఐరోపాలో భద్రతా సమస్యలపై చర్చ జరుగుతుంది.
మొత్తంగా:
ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే అవకాశం కలిగించనుంది. మోదీ-ట్రంప్ స్నేహబంధం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశముంది.