మహా కుంభ మేళా 2025 కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. విశిష్ట, అతి విశిష్ట వ్యక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయాగ్రాజ్ జాతర ప్రాంతంలో ఐదు చోట్ల 250 టెంట్ల సామర్థ్యంతో సర్క్యూట్ హౌస్లను ఏర్పాటు చేశారు. అలాగే, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 110 కాటేజీలతో టెంట్ సిటీ అభివృద్ధి చేయబడుతోంది. మొత్తం 2200 కాటేజీలతో కూడిన టెంట్ సిటీని అధికారులు నిర్మిస్తున్నారు.
మహా కుంభ మేళా 2025 జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు జరుగుతుంది. పుష్య మాస పౌర్ణమి మొదటి స్నానోత్సవం, మహాశివరాత్రి చివరి స్నానోత్సవంగా ఉంటాయి. దేశం, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, ప్రముఖులు పాల్గొనే ఈ మహా కార్యక్రమానికి ప్రయాగ్రాజ్ ఫెయిర్ అథారిటీ ప్రత్యేక ప్రోటోకాల్ ఏర్పాట్లు చేసింది.
వీఐపీల సౌలభ్యార్థం 24×7 కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో ముగ్గురు అదనపు జిల్లా మెజిస్ట్రేట్లు, 25 సెక్టార్ మేజిస్ట్రేట్లు నియమించారు. అధికారులు, ఉద్యోగులు ప్రోటోకాల్ సదుపాయాలను పర్యవేక్షిస్తారు.
సౌకర్యాలు:
- సర్క్యూట్ హౌస్: 250 టెంట్ల సామర్థ్యం.
- టెంట్ సిటీ: 2200 కాటేజీలు, బుకింగ్ ప్రయాగ్రాజ్ ఫెయిర్ అథారిటీ వెబ్సైట్లో అందుబాటులో.
- నదీ స్నానం: ఘాట్లు సిద్ధం, జెట్టీ మరియు మోటారు బోటు సౌకర్యం.
- విభాగాలు: 15 కేంద్ర శాఖలు, 21 రాష్ట్ర శాఖలు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి కాటేజీలు అందించాయి.https://www.youtube.com/watch?v=zrT-PKFe4Ng