• Home
  • Telangana
  • సుప్రీం తూటాలు: చెట్ల నరికివేతపై ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం!
Image

సుప్రీం తూటాలు: చెట్ల నరికివేతపై ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం!

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. “స్టేటస్ కో” కొనసాగించాలని స్పష్టంగా పేర్కొన్న ధర్మాసనం, తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. చెట్ల నరికి వేయడంపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? సూటిగా చెప్పండి,” అంటూ ప్రశ్నించింది. నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో వివరించ, అధికారుల కోసం తాత్కాలిక జైలు చెరువు దగ్గర ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేసింది.

పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ అనేది లేదని కోర్టు తేల్చేసింది. 1996 తీర్పును ఉల్లంఘిస్తూ మినహాయింపులు ఇచ్చిన అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రైవేట్ ఫారెస్ట్ అయినా చెట్ల నరికివేతను ఉపేక్షించబోమని కోర్టు స్పష్టం చేసింది. బుల్డోజర్లతో వంద ఎకరాలు తుడిచేస్తే సరిపోదు; అవసరమైన అనుమతులు తప్పనిసరి అన్నది కోర్టు స్పష్టత.

రాష్ట్ర తరఫున లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ, “ప్రస్తుతం అన్ని పనులు నిలిపేశాం, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం,” అన్నారు. అయితే అమికస్ క్యూరీ మాత్రం, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా అనుమతులు పొందడమంతా సుప్రీం తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న విషయాన్ని కూడా వివరించారు. ఈ కేసులో సీఈసీ నివేదికపై రాష్ట్రానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది ధర్మాసనం.

Releated Posts

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడవిని రక్షించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని…

ByByVedika TeamApr 18, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

హైకోర్టు స్టే: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 నియామకాలపై తాత్కాలిక ఆదేశాలు…!!

హైదరాబాద్, ఏప్రిల్ 18:తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు కొత్త మలుపు తిప్పాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.…

ByByVedika TeamApr 18, 2025

తెలంగాణ టెన్త్ ఫలితాలు త్వరలో విడుదల – మార్కుల విధానం, మెమోలపై తర్జనభర్జన….!!

హైదరాబాద్‌, ఏప్రిల్ 17:రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రేడింగ్…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply