• Home
  • Telangana
  • కంచ గచ్చిబౌలి వివాదం: విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, ఫేక్ వీడియోలపై నోటీసులు…
Image

కంచ గచ్చిబౌలి వివాదం: విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, ఫేక్ వీడియోలపై నోటీసులు…

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఊరట లభించింది. మరోవైపు, AI ఆధారంగా తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలు పోస్ట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణ కోసం ఆయనను ఈ నెల 9, 10, 11 తేదీల్లో హాజరు కావాలని సూచించారు.

AI వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తిస్తూ మరికొంతమందికి కూడా త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఈ వివాదంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమావేశమైంది. ఇందులో యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. వారు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, నిషేదాజ్ఞల రద్దు, పోలీసు బలగాల ఉపసంహరణ లాంటి అంశాలను ప్రస్తావించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విజ్ఞప్తుల మేరకు చర్యలు ప్రారంభించారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు కూడా ఉపసంహరించేందుకు ఆదేశాలు జారీచేశారు. అలాగే హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను వెనక్కి పంపించాలని వీసీకి లేఖ రాశారు.

ఇక కంచ గచ్చిబౌలి భూములపై ఉన్న హైకోర్టు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వ న్యాయవాదులు ఫేక్ వీడియోలు, అటవీ ప్రాంతాల తగలబడిన ఘటనలపై వివరాలతో కూడిన కౌంటర్‌ను హైకోర్టులో దాఖలు చేయనున్నారు.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply