• Home
  • Andhra Pradesh
  • జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!
Image

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:
జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జనవరిలో మొదటి విడత పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఇందులో ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో బీఈ/బీటెక్‌కు సంబంధించిన పేపర్-1 పరీక్షలు జరిగాయి. అలాగే ఏప్రిల్ 9న బీఆర్క్‌/బీ ప్లానింగ్‌కు సంబంధించిన పేపర్ 2ఏ, 2బీ పరీక్షలు నిర్వహించారు.

ఈ రెండు విడతలలో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించనున్నారు. ఇక ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువు ఏప్రిల్ 13 (ఆదివారం అర్ధరాత్రి)తో ముగియగా, వాటిని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తుది ఆన్సర్ కీతో పాటు ర్యాంకులను కూడా నేడు ప్రకటించనున్నారు.

కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను ప్రకటిస్తారు. నిపుణుల అంచనాల ప్రకారం కటాఫ్ రేంజ్‌లు ఇలా ఉండొచ్చు:

  • జనరల్ కేటగిరీ: 93%-95%
  • ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: 91%-93%
  • ఎస్సీ కేటగిరీ: 82%-86%
  • ఎస్టీ కేటగిరీ: 73%-80%

ఈ విడత ఫలితాలతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనున్నట్లు ప్రకటిస్తారు. అంటే మే 18న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు వీరే అర్హులు అవుతారు.

ఎన్‌టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది – తుది ఆన్సర్ కీ వచ్చే వరకు ప్రొవిజినల్ కీలో ఉన్న సమాధానాల ఆధారంగా ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని సూచించింది. ఎందుకంటే కొన్ని ప్రశ్నలపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో విద్యార్థులకు అదనంగా మార్కులు కలసే అవకాశముంది.

తుది కీతో పాటు ర్యాంకులనూ ఈరోజే విడుదల చేయనున్నందున విద్యార్థులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Releated Posts

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడవిని రక్షించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని…

ByByVedika TeamApr 18, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

హైకోర్టు స్టే: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 నియామకాలపై తాత్కాలిక ఆదేశాలు…!!

హైదరాబాద్, ఏప్రిల్ 18:తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు కొత్త మలుపు తిప్పాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply