• Home
  • Andhra Pradesh
  • “మూడు ఏళ్లు వేచిచూడండి, వైసీపీ తిరిగి గెలుస్తుంది” – జగన్
Image

“మూడు ఏళ్లు వేచిచూడండి, వైసీపీ తిరిగి గెలుస్తుంది” – జగన్

మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రాన్ని మేమే పాలిస్తాం” అంటూ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. జగన్ 2.0 పాలన పూర్తిగా కొత్తగా ఉంటుందని, చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచిన నాయకులతో భేటీ అయిన జగన్, పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. “కష్టకాలంలో మీరు చూపించిన నిబద్ధతకు పార్టీ రుణపడి ఉంటుంది” అంటూ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

“మూడు సంవత్సరాలు కళ్లుమూసుకుంటే గడిచిపోతాయి. ఆ తర్వాత వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది” అని తెలిపారు. జగన్ 1.0తో పోలిస్తే జగన్ 2.0 పాలన గట్టిగా ఉంటుంది అన్నారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి అని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్, “సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగ్గొట్టేందుకు అప్పులపై అబద్ధాలు చెబుతున్నారు” అన్నారు. చంద్రబాబు పాలనలో మోసాలే కనిపిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. “సంఖ్యాబలం లేకున్నా పోటీ చేసి, మా నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు” అని ఆరోపించారు.

“పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూశారు” అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు. రాబోయే రోజులు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply