• Home
  • Andhra Pradesh
  • “మూడు ఏళ్లు వేచిచూడండి, వైసీపీ తిరిగి గెలుస్తుంది” – జగన్
Image

“మూడు ఏళ్లు వేచిచూడండి, వైసీపీ తిరిగి గెలుస్తుంది” – జగన్

మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రాన్ని మేమే పాలిస్తాం” అంటూ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. జగన్ 2.0 పాలన పూర్తిగా కొత్తగా ఉంటుందని, చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచిన నాయకులతో భేటీ అయిన జగన్, పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. “కష్టకాలంలో మీరు చూపించిన నిబద్ధతకు పార్టీ రుణపడి ఉంటుంది” అంటూ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

“మూడు సంవత్సరాలు కళ్లుమూసుకుంటే గడిచిపోతాయి. ఆ తర్వాత వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది” అని తెలిపారు. జగన్ 1.0తో పోలిస్తే జగన్ 2.0 పాలన గట్టిగా ఉంటుంది అన్నారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి అని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్, “సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగ్గొట్టేందుకు అప్పులపై అబద్ధాలు చెబుతున్నారు” అన్నారు. చంద్రబాబు పాలనలో మోసాలే కనిపిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. “సంఖ్యాబలం లేకున్నా పోటీ చేసి, మా నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు” అని ఆరోపించారు.

“పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూశారు” అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు. రాబోయే రోజులు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Releated Posts

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం – ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచనలు మూడు రోజులు..!!

నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము వాయువ్య దిశగా కదిలి ఏప్రిల్ 08, 2025 ఉదయం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన…

ByByVedika TeamApr 8, 2025

కియా పరిశ్రమలో భారీ చోరీ: 900 కారు ఇంజిన్లు మాయం…!!

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమలో సంచలనాత్మక చోరీ వెలుగులోకి వచ్చింది. పరిశ్రమలో ఉంచిన…

ByByVedika TeamApr 8, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు.. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స…!!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడు. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో…

ByByVedika TeamApr 8, 2025

రొయ్యలపై అమెరికా భారీ సుంకం – రైతుల గుండెల్లో గుబురు..!

ప్లేటులో రొయ్యల కర్రీ రుచి చూడాలంటే… ఇప్పుడు వర్రీ అయ్యే పరిస్థితి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం రొయ్యల రైతులపై బాదుడు…

ByByVedika TeamApr 7, 2025

Leave a Reply