హైదరాబాద్ కుషాయిగూడలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అద్దె విషయంలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో 70 ఏళ్ల వృద్ధురాలిని ఓ టీనేజర్గా హత్య చేసి, ఆమె మృతదేహంపై డ్యాన్స్ చేశాడు. అంతే కాదు, దాన్ని సెల్ఫీ వీడియోగా తీస్తూ పైశాచికంగా ఆనందించాడు.

వృద్ధురాలు కమలాదేవికి చెందిన షాపులో అద్దెకు ఉంటున్న నిందితుడు, ఆమె మందలించడంతో కోపంతో ఏప్రిల్ 11న ఇనుపరాడ్తో దాడి చేసి చంపేశాడు. ఆపై చీరతో ఆమె తల సీలింగ్ ఫ్యాన్కు కట్టి, సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసాడు. దాన్ని శేర్ చేయడానికి మిత్రుడికి పంపినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు ఏప్రిల్ 13న బెంగళూరులో ఉన్న కమలాదేవి బంధువికి ఫోన్ చేసి హత్య విషయాన్ని చెప్పాడు. మొదట అతడు నమ్మలేదు కానీ వీడియో చూసాక షాక్కు గురయ్యాడు. వెంటనే ఓ పరిచితుడి ద్వారా కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఏప్రిల్ 14న ఇంటికి చేరుకోగా దుర్వాసన వస్తోంది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా, విపరీతంగా కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజస్థాన్కు చెందిన కృష్ణపాల్ సింగ్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.
బాధితురాలు కమలాదేవి గత 30 ఏళ్లుగా హైదరాబాద్లో నివసిస్తున్నారు. భర్త మరణించిన తరువాత ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ దారుణ సంఘటన నగరవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.