ఇప్పటి తరం హీరోయిన్లు కేవలం స్క్రీన్పై నటించడం వరకే ఆగిపోవడం లేదు. ఇప్పుడివాళ వాళ్లకి ఉన్న క్రేజ్, మార్కెట్ను సద్వినియోగం చేసుకుంటూ నిర్మాతలుగా మారుతున్నారు. కథ బాగుంటే అస్సలు వెనక్కి తగ్గకుండా.. ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్నారు.

ఈ ట్రెండ్ను టాలీవుడ్లో ముందుండి ఫాలో అవుతున్నవాళ్లలో నిహారిక కొణిదెల ముందస్తంగా చెప్పుకోవచ్చు. ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాతో నిర్మాతగా పరిచయమై, ఆ సినిమా ద్వారా తన సీరియస్ అటిట్యూడ్ను చూపించారు. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై రెండో సినిమా ప్రకటించారు.
ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించనుండగా, డైరెక్షన్ బాధ్యతలు మానస శర్మ తీసుకోనున్నారు. కథ నచ్చడంతో నిహారిక వెంటనే ఓకే చేసి, మరోసారి నిర్మాతగా బిజీ అయ్యారు. నటనతో పాటు నిర్మాణంలోనూ చెమటోడుస్తున్నారు.

ఇక సమంత కూడా తను స్థాపించిన ట్రాలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్పై ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఇది విడుదల కానుంది. కథ బాగుంటే నిర్మాణంలోకి దిగుతానంటూ, సమంత నిర్మాతగా మరో విభాగంలో కూడా రాణించడానికి సిద్ధంగా ఉన్నారు.

నయనతార విషయానికి వస్తే, ఆమె ఇప్పటికే రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ ద్వారా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలోనూ, కొన్నిసార్లు తానే కథానాయికగా ఈ బ్యానర్లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు హిట్స్ సాధించాయి.

ఇది మన దగ్గర తాజాగా మొదలైన ట్రెండ్ అయినా, బాలీవుడ్లో ఈ ఫార్ములా చాలా కాలంగా నడుస్తోంది. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే నిర్మాతలుగా బిజీగా ఉన్నారు. కంగనా అయితే దర్శకత్వంలో కూడా ప్రవేశించి, తనదైన మార్క్ వేస్తున్నారు.