• Home
  • Andhra Pradesh
  • AP: గవర్నర్ ప్రసంగం – సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి…!!
Image

AP: గవర్నర్ ప్రసంగం – సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి…!!

గవర్నర్ ప్రసంగం – సంక్షేమం, అభివృద్ధి పై దృష్టి

సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేసేందుకు ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రధాన విషయాలు:

  • పెన్షన్లు రూ. 4,000కు పెంచినట్లు గవర్నర్ ప్రకటించారు.
  • ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
  • పోలవరం ప్రాజెక్టును పురోగమింపజేశామని వివరించారు.
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేశామని తెలిపారు.
  • ఐటీ రంగం నుంచి ఏఐ విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
  • గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొన్నదని, కొత్త ప్రభుత్వం రాగానే తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు.
  • రాష్ట్రంలో రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని వివరించారు.
  • సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందన్నారు.
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు.

సంక్షేమ కార్యక్రమాలు:

పేదల ఆకలి తీరేందుకు అన్న క్యాంటీన్లను అందుబాటులో ఉంచామని గవర్నర్ తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పీఎం సూర్య ఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

అసెంబ్లీలో వైసీపీ నిరసన:

ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి నిరసనగా వైసీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ అధినేత జగన్ సహా పార్టీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొద్దిసేపటి పాటు నినాదాలు చేసిన అనంతరం వైసీపీ సభ్యులంతా అసెంబ్లీని వాకౌట్ చేశారు.

ప్రతిపక్ష హోదాపై వైసీపీ డిమాండ్:

రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు మాత్రమే ఉన్నప్పుడు వైసీపీని అధికారిక ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజా సమస్యలపై పోరాడాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలని తెలిపారు. గవర్నర్ ప్రభుత్వానికే కాకుండా ప్రతిపక్షానికీ అండగా నిలవాలని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అధికార పక్షం 11 మంది ప్రతిపక్ష సభ్యులను ఎదుర్కొనలేకపోతుందా? అంటూ ప్రశ్నించారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply