బడ్జెట్ 2025: క్యాన్సర్ డే కేర్ సెంటర్లు – మందుల ధరలు తగ్గింపు
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, ఖరీదైన వైద్య చికిత్సలో ఉపయోగించే మందుల ధరలపై కీలక ప్రకటనలు చేశారు. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు ఉపయోగించే 36 రకాల మందులను ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుండి మినహాయిస్తున్నట్లు ఆమె తెలిపారు.

అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాల్లో చికిత్స పొందే రోగులకు మందుల ధరలు చౌకగా లభిస్తాయి. అదనంగా, ఆరోగ్య పరిరక్షణను మరింత మెరుగుపరిచేందుకు ఆరు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్పై కస్టమ్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గించనున్నారు.
కస్టమ్స్ సుంకం నుండి పూర్తిగా మినహాయించబడిన 36 రకాల ప్రాణాలను రక్షించే మందులు ఇందులో ఉన్నాయి. అదనంగా, 37 కొత్త మందులు, 13 పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్లు (రోగులకు ఉచితంగా మందులు అందించే కార్యక్రమాలు) అందుబాటులోకి రానున్నాయి. ఈ చర్యల వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, సులభంగా చికిత్స పొందే అవకాశాలు లభించనున్నాయి.














