• Home
  • Entertainment
  • బాలకృష్ణ ఇంటికి వెళ్లినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!!
Image

బాలకృష్ణ ఇంటికి వెళ్లినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ కళాతమల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ఈ వార్త పట్ల సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బాలకృష్ణను వ్యక్తిగతంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ చేసిన సేవలకు పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గొప్పదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వండి:
బాలకృష్ణ మాట్లాడుతూ, “ఎన్టీఆర్‌ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఎన్టీఆర్‌ నాకు తండ్రి మాత్రమే కాదు, నాకు గురువు కూడా. ఈ అవార్డు నాలో మరింత స్ఫూర్తిని నింపుతుంది. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని నా విన్నపం. ఇది నా ఒక్కడి కోరిక కాదు, తెలుగు ప్రజలందరి కోరిక. పద్మభూషణ్‌ను బిరుదుగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నాను. మేం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నాం. నా అభిమానులు కూడా నా సినిమాలు, మంచి పనులే ఆశిస్తున్నారు. ఈ అవార్డు మరింత ప్రోత్సాహం ఇస్తుంది” అని పేర్కొన్నారు.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply