• Home
  • Andhra Pradesh
  • వేగంగా పెరుగుతున్న రక్తపోటు, షుగర్‌, కొవ్వు కాలేయం సమస్యలు – అపోలో తాజా హెచ్చరిక..!!
Image

వేగంగా పెరుగుతున్న రక్తపోటు, షుగర్‌, కొవ్వు కాలేయం సమస్యలు – అపోలో తాజా హెచ్చరిక..!!

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ సోమవారం విడుదల చేసిన ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025’ నివేదిక దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వివరాలు అందించింది. “లక్షణాల కోసం వేచిచూడకండి, ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చుకోండి” అనే సందేశంతో ఈ ఐదవ ఎడిషన్‌ను విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా 25 లక్షలమందిపైగా ఆరోగ్య పరీక్షలు ఆధారంగా రూపొందిన ఈ నివేదికలో ‘నిశబ్ధ మహమ్మారి’గా పేర్కొంటూ – లక్షణాలు లేకుండానే లక్షలాది మంది ప్రజలు వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

  • 26% మందికి రక్తపోటు
  • 23% మందికి మధుమేహం
  • 66% మందికి కొవ్వు కాలేయం
  • వీరిలో 85% మందికి మద్యపానం అలవాటు లేని వారే
    అయినప్పటికీ వారిలో వ్యాధుల లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో ప్రత్యేకంగా చూస్తే:

  • 44,448 మందికి పరీక్షలు
  • 10,427 మందికి అధిక రక్తపోటు
  • 24,246 మందికి ప్రీహైపర్‌టెన్షన్
  • 10,355 మందికి మధుమేహం
  • 14,000 మందికి మధుమేహం వచ్చే సూచనలు
  • 63% మందికి ఊబకాయం, 19% మందికి అధిక బరువు
  • 47% మందికి డిస్‌లిపిడెమియా
  • 3% మందికి మానసిక సమస్యలు (డిప్రెషన్, వ్యాకులత)

కాలేయ సమస్యలు:

  • 32,333 మందిలో 49% మంది గ్రేడ్‌ 1 ఫ్యాటీ లివర్
  • 5% మందికి గ్రేడ్‌ 2
  • 80 మందికి గ్రేడ్‌ 3
  • 6 మందికి గ్రేడ్‌ 4
  • 82% మందికి విటమిన్ డి లోపం

ఈ నివేదిక ఆధారంగా ప్రజలు ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply