• Home
  • Andhra Pradesh
  • ఆంధ్రప్రదేశ్ శాసనమండలి హాట్ హాట్ చర్చలు – అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు..!!
Image

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి హాట్ హాట్ చర్చలు – అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు..!!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు హీట్ పెంచుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి మరియు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య పాలన, అభివృద్ధి అంశాలపై తీవ్ర వాదప్రతివాదం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ హయాంలో చేపట్టిన పథకాల గురించి ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యంగా, వైసీపీ హయాంలో అభివృద్ధిపై చర్చించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విశాఖ రుషికొండ భవనాల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అమరావతిలో తాత్కాలిక భవనాల కోసం భారీగా ప్రభుత్వ ఖజానా ఖర్చు చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇస్తూ, విశాఖ రుషికొండ భవనాలకు ప్రజా ధనం దుర్వినియోగం జరగలేదా అని ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే, దానిపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాలు తాత్కాలికం కాకపోతే మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.

మంత్రి అచ్చెన్నాయుడు సమాధానంగా, తమ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేయదని, గత వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలకు కూడా బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయ భవనాలు తాత్కాలికం కాదని, అవి శాశ్వత భవనాలేనని స్పష్టం చేశారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply