• Home
  • Andhra Pradesh
  • ఆంధ్రప్రదేశ్ శాసనమండలి హాట్ హాట్ చర్చలు – అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు..!!
Image

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి హాట్ హాట్ చర్చలు – అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు..!!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు హీట్ పెంచుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి మరియు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య పాలన, అభివృద్ధి అంశాలపై తీవ్ర వాదప్రతివాదం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ హయాంలో చేపట్టిన పథకాల గురించి ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యంగా, వైసీపీ హయాంలో అభివృద్ధిపై చర్చించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విశాఖ రుషికొండ భవనాల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అమరావతిలో తాత్కాలిక భవనాల కోసం భారీగా ప్రభుత్వ ఖజానా ఖర్చు చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇస్తూ, విశాఖ రుషికొండ భవనాలకు ప్రజా ధనం దుర్వినియోగం జరగలేదా అని ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే, దానిపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాలు తాత్కాలికం కాకపోతే మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.

మంత్రి అచ్చెన్నాయుడు సమాధానంగా, తమ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేయదని, గత వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలకు కూడా బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయ భవనాలు తాత్కాలికం కాదని, అవి శాశ్వత భవనాలేనని స్పష్టం చేశారు.

Releated Posts

విశాఖ జీవీఎంసీ పీఠంపై కూటమి జెండా: 74 ఓట్లతో అవిశ్వాసం విజయం..!!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. అధికార కూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి, మేయర్ హరి వెంకట కుమారిపై…

ByByVedika TeamApr 19, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply