• Home
  • Andhra Pradesh
  • అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు సిద్ధం..!!
Image

అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు సిద్ధం..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధి సంబంధిత అనేక కీలక అంశాలపై చర్చించనుంది. పాలనకు పారదర్శకత, వేగం తీసుకురావడమే కాకుండా, గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ మళ్లీ ప్రారంభించాలనే సంకల్పంతో ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఫేజ్ 2 భూసేకరణ అంశంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. సీఆర్డీయే (CRDA) 46వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణపై చర్చించి, సీఆర్డీయే కమిషనర్‌కు ఆ అధికారాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే, ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీకి సంబంధించి CRDA చేసిన ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశముంది.

కేవలం రాజధాని నిర్మాణమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి టెండర్ల ఆమోదం కూడా ఈ సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, 5వ SIPB సమావేశంలో ఆమోదించిన రూ.30,667 కోట్ల పెట్టుబడులు మరియు 32,133 ఉద్యోగాల కల్పనపై కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూములు కేటాయించడంపై చర్చ జరగనుంది.

ఈ కేబినెట్ సమావేశం ద్వారా రాష్ట్ర పాలనకు వేగం తెచ్చేలా, అభివృద్ధి పనులకు పునాది వేసేలా చంద్రబాబు నాయకత్వం చూపబోతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమరావతి ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించేందుకు, రైతులకు న్యాయం చేయడానికి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ భేటీ కీలకంగా మారనుంది.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply