భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్తో సమాధానం ఇస్తున్నాయి. దీంతో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలోకి చేరింది. ఐదు దిక్కులా దాడులకు పాల్పడుతున్న భారత్ నుంచి తలదాచుకోవడానికి పాకిస్తాన్ కొత్తగా సైబర్ యుద్ధానికి దిగినట్లు తెలుస్తోంది.

ఇటీవల “డాన్స్ ఆఫ్ ది హిల్లరీ వైరస్” పేరుతో మాల్వేర్ పంపిణీ జరగుతోంది. ఈ వైరస్ను వీడియో ఫైల్స్, డాక్యుమెంట్స్ రూపంలో పంపుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. వైరస్ యాక్టివేట్ అయిన వెంటనే మొబైల్ లేదా కంప్యూటర్ వ్యవస్థలను దెబ్బతీసి, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం వంటి కీలక డేటాను హ్యాకర్లు ఎత్తుకుపోతున్నారు. ప్రత్యేకించి WhatsApp, Telegram, Email, Facebook ప్లాట్ఫామ్ల ద్వారా ఈ మాల్వేర్ పంపిణీ అవుతోంది.
భారత భద్రతా సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి – అనుమానాస్పద లింకులు, అపరిచితుల నుంచి వచ్చిన ఫైళ్లను తెరవొద్దని, ముఖ్యంగా .exe ఫైళ్లను పూర్తిగా నివారించాలన్న సూచనలు అందాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సందేహాస్పద సమాచారాన్ని తక్షణమే నివేదించాలని కోరుతున్నారు.
ఇక మరోవైపు, భారత్ సైనికంగా కూడా గట్టి ప్రతీకారం తీసుకుంటోంది. ఇస్లామాబాద్ సహా పాక్ లోని అనేక ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి, భారీ నష్టాన్ని కలిగించింది. డ్రోన్లను అడ్డుకుని, పలు ప్రాంతాల్లో పాక్ ఆర్మీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. పలు నగరాల్లో లాక్డౌన్ విధించినట్లు సమాచారం.