• Home
  • Andhra Pradesh
  • పుట్టబోయే బిడ్డ కోసం పోరాటం.. చివరికి కన్నతల్లి ప్రాణాల బలి…
Image

పుట్టబోయే బిడ్డ కోసం పోరాటం.. చివరికి కన్నతల్లి ప్రాణాల బలి…

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడుకు చెందిన పామర్తి మారేశ్వరరావు, జ్యోత్స్న దంపతులు బుధవారం రాత్రి తమ్ముడు వివాహం ఉండడంతో సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు. అయితే అదే రోజు మధ్యాహ్నం నుంచి జ్యోత్స్న కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తరలించారు.

అక్కడ స్కానింగ్ నిర్వహించిన వైద్యులు ఇది సాధారణ గర్భధారణ కాదని, గర్భసంచి వెలుపల పేగు దగ్గర పిండం అభివృద్ధి చెందిందని, అది పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావమవుతోందని చెప్పారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో రూ. 40,000 చెల్లించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయించారు.

ఆపరేషన్ అనంతరం గురువారం ఉదయం జ్యోత్స్న భర్తతో మాట్లాడిన కొన్ని నిమిషాల్లోనే మృతిచెందింది. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి జరిగిందని ఆరోపించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. వైద్యులు మాత్రం జ్యోత్స్న ఆసుపత్రికి చేరుకునే సమయానికే పరిస్థితి తీవ్రంగా ఉన్నదని, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకే ఆపరేషన్ చేశామని తెలిపారు. చివరకు కుటుంబసభ్యులతో రాజీ కుదిరినట్టు సమాచారం. మృతురాలికి ఇద్దరేళ్ల కుమార్తె ఉండటం మరింత కంటతడి పెట్టిస్తోంది.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply