• Home
  • Andhra Pradesh
  • అమరావతి రీ-లాంచ్‌కు కౌంట్‌డౌన్: రేపు మోదీ చేతులమీదుగా భారీ శంకుస్థాపనలు!
Image

అమరావతి రీ-లాంచ్‌కు కౌంట్‌డౌన్: రేపు మోదీ చేతులమీదుగా భారీ శంకుస్థాపనలు!

అమరావతి రాజధాని పునఃప్రారంభానికి భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు జరగనున్నాయి. మొత్తం రూ. 1.06 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన భూమిపూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తూ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

రేపు జరిగే కార్యక్రమంలో ప్రధానంగా హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, కేంద్ర సేవల అధికారుల నివాస సముదాయాలకు శంకుస్థాపన జరుగుతుంది. దీనితో పాటు డీఆర్డీవో, NHAI, రైల్వే, DPIIT శాఖల పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా నాగాయలంకలో రూ.1500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్‌కు ఇది శ్రీకారం.

వేదికపై మొత్తం 14 మంది కూర్చోనున్న ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది. మోదీ హెలిపాడ్ నుండి కారులో వేదిక వద్దకు చేరుకుని సభకు హాజరుకానున్నారు. సభ ప్రాంగణాన్ని మూడు విభాగాలుగా విభజించారు.

అమరావతి రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయగా, మహిళలను పెద్దఎత్తున సభకు ఆహ్వానించేందుకు CRDA ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి మహిళలను ఆహ్వానించడమో విశేషం. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాని వేదికపైకి రాగానే ‘అమరావతి రీస్టార్ట్ పైలాన్’ ఆవిష్కరించనున్నారు. A అక్షర ఆకారంలో నిర్మించిన 21 అడుగుల గ్రానైట్ పైలాన్ ఇది. ఇది రాజధాని పునాది ప్రకటనగా గుర్తింపు పొందనుంది.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply