ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ జట్టు తడబడినప్పటికీ విరాట్ కోహ్లీ (51 పరుగులు) మరియు కృనాల్ పాండ్యా (73 పరుగులు) కలిసి నాల్గవ వికెట్కు 119 పరుగుల భాగస్వామ్యం చేస్తూ జట్టును గెలిపించారు.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, క్రీజులో ఉన్న సమయంలో 4 ఫోర్లు బాదాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ను ‘ఇది నా మైదానం’ అంటూ ఆటపట్టించాడు. గతంలో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఇదే సెలబ్రేషన్ చేశాడు. ఇప్పుడు కోహ్లీ ఢిల్లీలో అదే మాటతో సమాధానం ఇచ్చాడు.
ఈ విజయం ద్వారా ఆర్సీబీ 10 మ్యాచ్ల్లో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి ఎగబాకింది. కోహ్లీ ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 443 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ క్రమంలో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్లో కోహ్లీ రాహుల్కు ఇచ్చిన గట్టిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు కోహ్లీ మాస్ సెలబ్రేషన్కు ఫిదా అయిపోతున్నారు.