• Home
  • National
  • “పాకిస్తాన్ భయంతో కుటుంబాల తరలింపు.. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం షురూ!”
Image

“పాకిస్తాన్ భయంతో కుటుంబాల తరలింపు.. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం షురూ!”

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార దాడులకు తెరలేపింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు మళ్లీ కవ్మింపు చర్యలు చేపడుతున్నారు. దీనిపై భారత భద్రతా దళాలు గట్టిగా స్పందిస్తూ జమ్ము కశ్మీర్‌లో భారీగా సెర్చ్ ఆపరేషన్లను చేపట్టాయి. లోకల్ టెర్రరిస్టులపై కూడా దళాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, భారత్ యాక్షన్‌లోకి దిగడంతో పాకిస్తాన్ భయాందోళనకు గురవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన కుటుంబంతో పాటు పలువురు ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా విదేశాలకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. వీరిని బ్రిటన్, అమెరికాలకు పంపినట్టు సమాచారం.

ఈ దాడి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పాకిస్థాన్‌పై చర్యలు ముమ్మరం చేసింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారి సరిహద్దు రాకపోకలు నిలిపివేసింది. పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసి, 48 గంటల్లో దేశం విడిచిపెట్టాలని ఆదేశించింది.

హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి, గడువు తర్వాత ఒక్క పాకిస్తానీ కూడా దేశంలో ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. పాక్ ఆర్మీ ఒకవైపు ధైర్యంగా ఉన్నట్టు చూపిస్తూనే, మరోవైపు కుటుంబాలను సేఫ్ జోన్లకు తరలించటం వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!

పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply