• Home
  • Andhra Pradesh
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 దరఖాస్తులు ప్రారంభం – ఐఐటీ ప్రవేశాల కోసం కీలక సమాచారం…
Image

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 దరఖాస్తులు ప్రారంభం – ఐఐటీ ప్రవేశాల కోసం కీలక సమాచారం…

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: దేశంలోని 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు ఏప్రిల్‌ 23 నుంచి మే 2, 2025 వరకు అందుబాటులో ఉంటాయి.

జేఈఈ మెయిన్‌ 2025 రెండు విడతల్లో అర్హత సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలకు రూ.1600 కాగా, ఇతరులకి రూ.3200.

అడ్మిట్ కార్డులు మే 11 నుంచి 18 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష మే 18న జరుగుతుంది – పేపర్‌ 1 ఉదయం 9:00 నుండి 12:00 వరకు, పేపర్‌ 2 మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్‌ ద్వారా అర్హత పొందిన 2,50,236 మంది అడ్వాన్స్‌డ్‌ రాయవచ్చు. మెయిన్‌కు దేశవ్యాప్తంగా 15.39 లక్షల మంది దరఖాస్తు చేయగా, 14.75 లక్షల మంది పరీక్ష రాశారు.

అదేవిధంగా NITలు, ట్రిపుల్‌ఐటీలు, GFTIల్లో ప్రవేశాలకూ వీరు పోటీ పడొచ్చు. ఐఐటీలో చేరాలంటే మాత్రం అడ్వాన్స్‌డ్‌ తప్పనిసరి. ఫలితాలు జూన్‌ 2న విడుదలవుతాయి.

ఈ ఏడాది ఐఐటీల్లో 17,695 B.Tech మరియు B.Sc సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఆర్క్‌ కోర్సులకు ఆశించేవారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (AAT) కూడా రాయాలి, ఇది జూన్‌ 5న జరుగుతుంది.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply