• Home
  • Andhra Pradesh
  • తెలంగాణ, ఏపీలో నిప్పుల వర్షం – రెడ్ అలర్ట్‌తో జనం ఉక్కిరిబిక్కిరి!
Image

తెలంగాణ, ఏపీలో నిప్పుల వర్షం – రెడ్ అలర్ట్‌తో జనం ఉక్కిరిబిక్కిరి!

ఏప్రిల్‌లోనే మే నెల వేడి మొదలైపోయింది. నిన్నమొన్నటి వరకూ అకాల వర్షాలు కాస్త ఉపశమనం కలిగించగా, ఇప్పుడు మళ్లీ భానుడు నిప్పులు చెరిగిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండలు భయంకరంగా మారుతున్నాయి. మధ్యాహ్నం అయితే మరింత వేడిగా మారి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా, 19 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో తీవ్ర వేడి ఉంది. నిన్న ఆదిలాబాద్‌లో 44.3, నిజామాబాద్‌ 44 డిగ్రీలు నమోదు కాగా, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీలోనూ పరిస్థితి భయంకరంగా ఉంది. గోనవరంలో 44 డిగ్రీలు, కడపలో 43.6, కర్నూలులో 42.9 డిగ్రీల తాపం నమోదైంది. మొత్తం 135 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా రికార్డయింది. వేడి గాలులు కూడా జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎండల ప్రభావంతో ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply