• Home
  • National
  • పహల్గామ్ ఉగ్రదాడి: హనీమూన్‌కు వెళ్లిన నూతన వరుడు శుభం ద్వివేది సహా అనేక పర్యాటకుల దుర్మరణం…!!
Image

పహల్గామ్ ఉగ్రదాడి: హనీమూన్‌కు వెళ్లిన నూతన వరుడు శుభం ద్వివేది సహా అనేక పర్యాటకుల దుర్మరణం…!!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నూతన వరుడు శుభం ద్వివేది కూడా మరణించాడు. శుభం ఫిబ్రవరి 12, 2025న పెళ్లి చేసుకుని, భార్యతో కలిసి హనీమూన్‌ కోసం కాశ్మీర్‌కు వెళ్లాడు. పెళ్లి జరిగిన రెండు నెలలకే అతని జీవితం అర్థాంతరంగా ముగిసింది. శుభం భార్య హనీమూన్‌ను ఒక పీడకలలా అనుభవించాల్సి వచ్చింది.

ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభం బంధువు సౌరభ్ ద్వివేది మాట్లాడుతూ — ఉగ్రవాదులు వ్యక్తుల పేర్లు అడిగిన తర్వాతే కాల్పులు ప్రారంభించారని తెలిపారు. శుభాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి, అతని తలపై నేరుగా కాల్చారని ఆరోపించారు. దాడి జరిగిన వెంటనే శుభం భార్య తన మామకు ఫోన్ చేసి శుభం మరణాన్ని తెలియజేసింది. పర్యాటకుల పేర్లు అడిగి ఖచ్చితంగా టార్గెట్ చేసినట్లు ఆమె తెలిపిందని తెలిపారు.

ఈ దాడిలో మహారాష్ట్రకు చెందిన న్యూ పన్వేల్ నివాసి దిలీప్ దేసాలే, నావికాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (కర్నాల్), అకౌంట్స్ ఆఫీసర్ ప్రశాంత్ సత్పతి (ఒడిశా), శైలేష్ కడాటియా (సూరత్) వంటి పలువురు మృతి చెందారు. ప్రశాంత్ భార్య, చిన్న కొడుకు గురించి ఇంకా సమాచారం అందలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దారుణ ఘటనను బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ఇది ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా, పెరూ పర్యటనలను రద్దు చేసుకున్నారు. భారత్‌కు చేరిన ప్రధాని మోదీ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!

పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల…

ByByVedika TeamMay 10, 2025

ఐపీఎల్ 2025కి బ్రేక్: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI కీలక నిర్ణయం…

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ 2025పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

ఉగ్రదాడులకు తగిన ప్రతీకారం: మళ్లీ యుద్ధ భూమిలోకి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్‌ పాక్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మిస్సైల్ దాడులు చేపట్టింది. పాక్…

ByByVedika TeamMay 8, 2025

ఒక్క రైల్వే ఉద్యోగానికి లక్షల పోటీదారులు! RRB NTPC 2025 CBT షెడ్యూల్ ఇదే!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి CBT 1 పరీక్షను 2025 జూన్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.…

ByByVedika TeamMay 8, 2025

భారత-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందన: శాంతికి తాను సిద్ధమే!

భారతదేశం–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య పెరిగిన సంఘర్షణను…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply