తెలుగు సినిమాల్లో త్వరగా క్రేజ్ తెచ్చుకున్న నటి భాగ్య శ్రీ బోర్సే ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, అందం, అభినయంతో తొలి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది.

ఇప్పటివరకు ఫోకస్ సినిమాలపైనే పెట్టిన భాగ్యశ్రీ పేరు ప్రస్తుతం రామ్ పోతినేని డేటింగ్ గాసిప్స్తో నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇద్దరూ ఓ సినిమాలో కలిసి నటిస్తున్న క్రమంలో వారి ఫోటోలు వైరల్ అవుతూ బ్యాక్డ్రాప్ ఒకేలా ఉండటం గమనార్హం. దీంతో నెటిజన్లు ‘‘ఒకే గదిలోనా?’’, ‘‘చేతికి ఉంగరం ఎవరు పెట్టారు?’’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

ఈ ప్రచారాలపై భాగ్యశ్రీ స్పందిస్తూ, ‘‘అది నేను కొనుక్కున్న ఉంగరం..’’ అని తేల్చేసింది. ప్రస్తుతం ఆమె రామ్తో మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఇందులో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ మహాలక్ష్మిగా కనిపించనున్నారు. ఒక షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, మరో ప్రాజెక్ట్గా ఆమె దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘కాంత’ చిత్రంలో కూడా నటిస్తోంది.
