• Home
  • Andhra Pradesh
  • ఏపీ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల – వివరాలు ఇక్కడ చూడండి!
Image

ఏపీ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల – వివరాలు ఇక్కడ చూడండి!

అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య సమాచారం. 2025 మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23), ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు అధికారికంగా ప్రకటించారు.

ఇందులో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు చూసేందుకు మిగతా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనమిత్ర (WhatsApp) ద్వారా ఫలితాల కోసం 9552300009 నంబరుకు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అటుపై విద్యాసేవలు → SSC Results → హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. అలాగే LEAP యాప్ ద్వారా కూడా ఫలితాలు చూసే సౌకర్యం ఉంటుంది.

పాఠశాలల ప్రిన్సిపల్స్‌ తమ లాగిన్‌ ద్వారా తమ స్కూల్ విద్యార్థుల ఫలితాల మేమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుండి 9 వరకు జరిగింది. అలాగే సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్ పరీక్షలు మార్చి 17 నుండి 28 వరకు జరిగాయి.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply