పర్యావరణవేత్తలు ప్లాస్టిక్ను నిషేధించాలని పిలుపునిచ్చినా, ఇళ్లలో వీటి వాడకం అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా వేడి ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం హానికరం. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ముఖ్యంగా వేడి అన్నాన్ని ప్లాస్టిక్ కంటైనర్లో ఉంచితే ప్రాణానికే ప్రమాదం.

ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి అన్నం నిల్వ చేయకూడదనే విషయం ఎందుకంటే, ఆయుర్వేద ఆరోగ్య నిపుణుల ప్రకారం బియ్యాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేస్తే అది విషంగా మారుతుంది. వేడి వల్ల ప్లాస్టిక్ కంటైనర్లలో అఫ్లాటాక్సిన్లు, మైకోటాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మూత్రపిండాలు, కాలేయం దెబ్బతీస్తాయి. అందుకే, ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి అన్నం నిల్వ చేయడం మానుకోవాలి.
ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయకూడనివి:
- ఆకుకూరలు: కోసిన ఆకుకూరలను ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ చేస్తే అవి తేమ కోల్పోతాయి, దాంతో ఆ ఆహారం విషంగా మారుతుంది.
- ఉడికించిన పప్పులు, బీన్స్: ఈ ఆహారాలను ఫ్రిజ్లో ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల వాటి పోషకాలు తగ్గిపోతాయి.
- విటమిన్ C అధికంగా ఉండే పండ్లు: నారింజ, బెల్ పెప్పర్స్ వంటి పండ్లను ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టితే వాటి పోషక విలువలు తగ్గిపోతాయి.

ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేసే ముందు:
- వేడి లేదా వండిన ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ చేయవద్దు.
- ప్లాస్టిక్ కంటైనర్లను మళ్లీ వేడి చేయవద్దు.
- చల్లని, పొడి ఆహారాన్ని మాత్రమే ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయాలి.
ముఖ్యంగా: ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి నీటిని కూడా ఉంచకూడదు. ప్లాస్టిక్ వేడెక్కినప్పుడు అది రసాయనాలను విడుదల చేస్తుంది, ఇవి ఆరోగ్యానికి హానికరం.