ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు సస్పెన్స్ నడిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున బ్యాటర్లు చక్కగా రాణించారు.

అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరి వరకు పోరాడి అదే స్కోరు 188 పరుగులు సాధించింది. ఇరు జట్లు సమాన స్కోరు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ఐపీఎల్లో నాలుగేళ్ల విరామం తర్వాత మరోసారి సూపర్ ఓవర్కి తెరతిరిగింది. చివరిసారి 2021లో ఢిల్లీ క్యాపిటల్స్-సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య సూపర్ ఓవర్ జరిగితే, అందులోనూ ఢిల్లీ విజయం సాధించింది.
ఈసారి కూడా అదేనంటూ, రాజస్థాన్ జట్టు సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసి 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (7), స్టబ్స్ (6) కేవలం నాలుగు బంతుల్లోనే విజయాన్ని అందించారు. రాజస్థాన్ తరఫున బౌలింగ్ చేసిన సందీప్ శర్మను ఢిల్లీ దెబ్బతీసింది.
ఈ థ్రిల్లింగ్ గేమ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన సూపర్ ఓవర్ను గెలిచిన ఢిల్లీ మరోసారి తన స్థాయిని చాటిచెప్పింది.