• Home
  • Andhra Pradesh
  • వేగంగా పెరుగుతున్న రక్తపోటు, షుగర్‌, కొవ్వు కాలేయం సమస్యలు – అపోలో తాజా హెచ్చరిక..!!
Image

వేగంగా పెరుగుతున్న రక్తపోటు, షుగర్‌, కొవ్వు కాలేయం సమస్యలు – అపోలో తాజా హెచ్చరిక..!!

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ సోమవారం విడుదల చేసిన ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025’ నివేదిక దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వివరాలు అందించింది. “లక్షణాల కోసం వేచిచూడకండి, ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చుకోండి” అనే సందేశంతో ఈ ఐదవ ఎడిషన్‌ను విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా 25 లక్షలమందిపైగా ఆరోగ్య పరీక్షలు ఆధారంగా రూపొందిన ఈ నివేదికలో ‘నిశబ్ధ మహమ్మారి’గా పేర్కొంటూ – లక్షణాలు లేకుండానే లక్షలాది మంది ప్రజలు వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

  • 26% మందికి రక్తపోటు
  • 23% మందికి మధుమేహం
  • 66% మందికి కొవ్వు కాలేయం
  • వీరిలో 85% మందికి మద్యపానం అలవాటు లేని వారే
    అయినప్పటికీ వారిలో వ్యాధుల లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో ప్రత్యేకంగా చూస్తే:

  • 44,448 మందికి పరీక్షలు
  • 10,427 మందికి అధిక రక్తపోటు
  • 24,246 మందికి ప్రీహైపర్‌టెన్షన్
  • 10,355 మందికి మధుమేహం
  • 14,000 మందికి మధుమేహం వచ్చే సూచనలు
  • 63% మందికి ఊబకాయం, 19% మందికి అధిక బరువు
  • 47% మందికి డిస్‌లిపిడెమియా
  • 3% మందికి మానసిక సమస్యలు (డిప్రెషన్, వ్యాకులత)

కాలేయ సమస్యలు:

  • 32,333 మందిలో 49% మంది గ్రేడ్‌ 1 ఫ్యాటీ లివర్
  • 5% మందికి గ్రేడ్‌ 2
  • 80 మందికి గ్రేడ్‌ 3
  • 6 మందికి గ్రేడ్‌ 4
  • 82% మందికి విటమిన్ డి లోపం

ఈ నివేదిక ఆధారంగా ప్రజలు ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Releated Posts

“నన్నే టార్గెట్ చేస్తారా?” – స్మితా సబర్వాల్ స్పందన వైరల్

కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో, రీట్వీట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు…

ByByVedika TeamApr 19, 2025

విశాఖ జీవీఎంసీ పీఠంపై కూటమి జెండా: 74 ఓట్లతో అవిశ్వాసం విజయం..!!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. అధికార కూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి, మేయర్ హరి వెంకట కుమారిపై…

ByByVedika TeamApr 19, 2025

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల – ఇంటర్ బోర్డు ప్రకటన

తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11…

ByByVedika TeamApr 19, 2025

IPL 2025 ఫిక్సింగ్ ఆరోపణలపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన 34 మ్యాచ్‌ల అనంతరం ఢిల్లీ జట్టు…

ByByVedika TeamApr 19, 2025

Leave a Reply