• Home
  • Andhra Pradesh
  • రొయ్యలపై అమెరికా భారీ సుంకం – రైతుల గుండెల్లో గుబురు..!
Image

రొయ్యలపై అమెరికా భారీ సుంకం – రైతుల గుండెల్లో గుబురు..!

ప్లేటులో రొయ్యల కర్రీ రుచి చూడాలంటే… ఇప్పుడు వర్రీ అయ్యే పరిస్థితి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం రొయ్యల రైతులపై బాదుడు మోపుతోంది. ఇప్పటివరకు 3 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 26 శాతానికి పెంచేశాడు. దీంతో లక్ష రూపాయల విలువ చేసే రొయ్యల ధర ఇప్పుడు లక్షా 26 వేలకు పెరిగిపోయింది. రవాణా, ప్యాకింగ్ ఖర్చులతో కలిపితే మొత్తం ఖర్చు 50 శాతం పెరిగింది.

ఈ ప్రభావంతో ఎగుమతి దారులు కేజీకి రూ.30 నుంచి రూ.50 వరకు ధరలు తగ్గించేసి రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. మార్కెట్‌లో రొయ్య ధర ఒక్కసారిగా పడిపోయింది. ఈ నెల 9 నుంచి కొత్త సుంకం అమలులోకి రానుంది. ఏపీ నుంచి అమెరికాకు ఏటా 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు ఎగుమతి అవుతుంటే, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 2 వేల టన్నుల రొయ్యలు బయలుదేరుతుంటాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆక్వా రంగాన్ని రక్షించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. అమెరికా విధించిన 27% సుంకాన్ని ఉపసంహరించాలని, ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర GDPలో మత్స్యరంగం 11% వాటా కలిగి ఉందని వివరించారు. అధిక సుంకాల వల్ల విదేశీ ఆర్డర్లు రద్దవుతుండగా, శీతల గిడ్డంగుల్లో నిల్వకూ స్థలాభావం ఏర్పడిందని తెలిపారు.

కేంద్రం చర్యలు తీసుకుంటుందని సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హామీ ఇచ్చారు. అయితే, రైతుల పరిస్థితిపై కూటమి ప్రభుత్వం స్పందించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల వర్గాలు సిండికేట్‌లుగా మారాయని విమర్శించారు. రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply