• Home
  • Entertainment
  • ఎన్టీఆర్: కామెడీ తీయడం సులువు కాదు.. అందుకే ‘అదుర్స్ 2’ ఆగిపోయింది!
Image

ఎన్టీఆర్: కామెడీ తీయడం సులువు కాదు.. అందుకే ‘అదుర్స్ 2’ ఆగిపోయింది!

ఇటీవల ‘దేవర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం భారీ అంచనాల మధ్య రూపొందుతున్న *’వార్ 2’*లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇటీవల థియేటర్లలో నిరీక్షణ లేకుండా విడుదలై సూపర్ హిట్ సాధించిన చిత్రాల్లో మ్యాడ్ స్క్వైర్’ ఒకటి. యంగ్ హీరోస్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మ్యాడ్కి ఇది సీక్వెల్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘనవిజయం సాధించింది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మ్యాడ్ స్క్వైర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై, సందడి చేశారు. ఆయన మ్యాడ్ టీం గురించి మాట్లాడుతూ, వారి ప్రతిభను ప్రశంసించారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ –

“నవ్వించడం ఒక గొప్ప వరం. మనల్ని నవ్వించేందుకు కళ్యాణ్ శంకర్ లాంటి దర్శకుడు దొరకడం అదృష్టం. ఈ సినిమాలో లడ్డు (విష్ణు) లేకపోతే హిట్ అయ్యేది కాదు. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కూడా అద్భుతంగా నటించారు. ‘దేవర’ సినిమాను అభిమానించి, భుజాలపై మోసినందుకు ధన్యవాదాలు. ‘దేవర 2’ ఉండదని అనుకునేవారికి చెబుతున్నా – ఆ సినిమా ఖచ్చితంగా వస్తుంది. మధ్యలో విరామం తీసుకున్నాం, ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వచ్చింది. త్వరలో నాగవంశీతో మరో సినిమా చేయబోతున్నాం. ఆ సినిమాను స్టార్ట్ చేసిన వెంటనే ఫ్యాన్స్ అందరినీ హ్యాండిల్ చేయమని వదిలేస్తా,” అని పేర్కొన్నారు.

అలాగే అదుర్స్ 2 గురించి మాట్లాడుతూ –

“కామెడీ చేయడం ఒక్క యాక్టర్‌కి చాలా కష్టం. అందుకే అదుర్స్ 2 చేయాలనే ఆలోచనలో ఉన్నాను” అని ఎన్టీఆర్ తెలిపారు. గతంలో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ చిత్రం పెద్ద విజయం సాధించింది. అందుకే దీని సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మొదటి భాగంలో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply