• Home
  • Andhra Pradesh
  • అమరావతి అభివృద్ధికి వేగం: హడ్కోతో చంద్రబాబు కీలక ఒప్పందం..!!
Image

అమరావతి అభివృద్ధికి వేగం: హడ్కోతో చంద్రబాబు కీలక ఒప్పందం..!!

ఏపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి గణనీయంగా వేగం పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వీలైన అన్ని మార్గాల్లో నిధులను సమీకరించి, వేగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి రుణాలు పొందుతున్న చంద్రబాబు సర్కారు, తాజాగా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి అమరావతి అభివృద్ధికి 11 వేల కోట్ల రూపాయల రుణం మంజూరైంది. సీఎం చంద్రబాబు నివాసం ఉండవల్లిలో సీఆర్డీఏతో హడ్కో మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీంతో త్వరలోనే ఈ భారీ నిధులు అమరావతికి అందుబాటులోకి రానున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ రుణాన్ని మంజూరు చేయడానికి అంగీకారం లభించింది. తాజాగా ఈ నిధుల విడుదల కోసం సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారిక ఒప్పందం జరిగింది.

అమరావతిని వేగంగా అభివృద్ధి చేసి, ఆర్థిక వృద్ధిని సాధించడంతో పాటు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, గతంలో పలు సంస్థలకు కేటాయించిన భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే, 30 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి.

ఈ నిధులతో అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాలు, రహదారులు, నీటి సరఫరా వంటి కీలక పనులను వేగంగా పూర్తి చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Releated Posts

విశాఖ జీవీఎంసీ పీఠంపై కూటమి జెండా: 74 ఓట్లతో అవిశ్వాసం విజయం..!!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. అధికార కూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి, మేయర్ హరి వెంకట కుమారిపై…

ByByVedika TeamApr 19, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply