• Home
  • Telangana
  • ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ – కీలక అంశాలపై చర్చ…!!
Image

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ – కీలక అంశాలపై చర్చ…!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీను కలిశారు. ఈ భేటీలో SLBC టన్నెల్ సహాయక చర్యలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల జాబితా మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఐదు కీలక అంశాలపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందించారు.

రేవంత్ రెడ్డి వినతులు

  1. హైదరాబాద్ మెట్రో ఫేజ్ – 2 కోసం రూ.22,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి.
  2. రీజనల్ రింగ్ రోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలని అభ్యర్థన.
  3. డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే & రైల్వే లైన్ నిర్మాణం.
  4. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం నిధుల మంజూరు.
  5. 27 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయడంతో పాటు వరద నియంత్రణ చర్యల కోసం నిధులు కేటాయించాలని కోరారు.

ప్రధాని మోదీ సూచనలు

  • 2017-2022 మధ్య పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు.
  • ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన (గ్రామీణ) అమలు కోసం 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తిచేసి అర్హులను గుర్తించాలి.
  • శంషాబాద్ ESI ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.150 కోట్లు విడుదల చేయాలని తెలిపారు.
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం మూడు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.
  • బీబీనగర్ AIMMSకి నీటి & విద్యుత్ సరఫరా కోసం రూ.1,365.95 కోట్లు మంజూరు చేయాలని సూచించారు.
  • రైల్వే ప్రాజెక్టులకు అటవీ అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
  • మూడు నీటి పారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించి పంపాలని మోదీ సూచించారు.

ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply