• Home
  • National
  • బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం: లడ్డూ మహోత్సవంలో 65 అడుగుల వేదిక కుప్పకూలింది…!!
Image

బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం: లడ్డూ మహోత్సవంలో 65 అడుగుల వేదిక కుప్పకూలింది…!!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బాగ్‌పత్‌లో ఆదినాథుడి ఆలయంలో జరిగిన లడ్డూ మహోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల ఎత్తైన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సంఘటన జనవరి 28, 2025 ఉదయం బాగ్‌పత్ జిల్లా, కొత్వాలి ప్రాంతంలోని గాంధీ రోడ్డులో జరిగింది. ఆదినాథ్ ఆలయంలో జరుగుతున్న లడ్డూ మహోత్సవం సందర్భంగా, చెక్కతో నిర్మించిన వేదికపై విగ్రహం ఉంచారు. భక్తులు గుడిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కుతుండగా, అధిక బరువు కారణంగా మెట్లు విరిగి వేదిక కుప్పకూలిపోయింది.

వేదిక కూలిన వెంటనే 50 మంది పైగా భక్తులు దానిలో చిక్కుకున్నారని, అందులో 7 మంది మరణించారని, 40 మందికి పైగా గాయపడారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 5 మంది పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.

సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంఘటన స్థలాన్ని సందర్శించి, అధికారులను సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!

పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply