• Home
  • Telangana
  • మోదీ, అదానీలు దేశం పరువు తీశారు: సీఎం రేవంత్ రెడ్డి
Image

మోదీ, అదానీలు దేశం పరువు తీశారు: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ప్రధాని మోదీ, బీజేపీల‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వ‌చ్చింద‌ని, ప్రధాని మోదీ, అదానీలు క‌ల‌సి దేశ పరువు తీసేశారని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. అదానీ అవినీతిని ప్ర‌దాని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అడిగారు. అదానీపై ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ చేపట్టారు. రాజ్ భవన్ సమీపంలో సీఎం భైఠాయించి నిరసన తెలిపారు.

దేశ పరువును మంటకలిపిన అదానీపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారతదేశంలోని వ్యాపార సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయ‌న ఆరోపించారు. అదానీ సంస్థలు అగ్ర‌రాజ్యం అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించడంతో అమెరికా ప్రభుత్వం చర్యలకు ఉప‌క్ర‌మించింద‌ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

అదానీ అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని రేవంత్ అన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీఆర్ఎస్ నేతలు లొంగిపోయారని… అందుకే వారు అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని విమర్శించారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం లోక్ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సి ఉంద‌ని అన్నారు.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply