• Home
  • Andhra Pradesh
  • మూడుసార్లు కిడ్నీ మార్పిడి – ఎన్టీఆర్ జిల్లా మహిళ అరుదైన ఘనత..!!
Image

మూడుసార్లు కిడ్నీ మార్పిడి – ఎన్టీఆర్ జిల్లా మహిళ అరుదైన ఘనత..!!

గతంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చాలా అరుదుగా వినేవాళ్లం. కానీ మారుతున్న జీవన శైలి కారణంగా కిడ్నీ సమస్యలు పెరిగి, మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ మహిళ (30)కు ఇప్పటివరకు మూడుసార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం ఆశ్చర్యకరమైన విషయం.

నందిగామకు చెందిన ఈ మహిళకు కిడ్నీ ఫెయిల్ కావడంతో, మొదటి సారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేశారు. కానీ, ఆ రెండు మార్పిడులు విఫలమయ్యాయి. చివరికి, డాక్టర్ల సలహా మేరకు, మూడోసారి తండ్రి తన కిడ్నీ దానం చేశారు. విజయవాడలోని శరత్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్ శరత్‌బాబు నేతృత్వంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.

ఒకే వ్యక్తికి మూడుసార్లు కిడ్నీ మార్పిడి జరగడం చాలా అరుదైన విషయం అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ మహిళ ఆరోగ్యంగా ఉండడం అందరికీ సంతోషం కలిగిస్తోంది.

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Releated Posts

ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారాలు నిల్వ చేయడం హానికరం – ఆరోగ్య నిపుణుల సూచనలు…!!

పర్యావరణవేత్తలు ప్లాస్టిక్‌ను నిషేధించాలని పిలుపునిచ్చినా, ఇళ్లలో వీటి వాడకం అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా వేడి ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం…

ByByVedika TeamApr 17, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…

ByByVedika TeamApr 17, 2025

పసిడి పరుగులు: గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా – ఈ ఏడాది చివరికి రూ.1.25 లక్షలు!

పసిడి పరుగులు పెడుతోంది. కేవలం మూడు అడుగుల దూరంలో లక్ష రూపాయల మార్కు కనిపిస్తోంది. ‘గోల్డ్‌ రేట్లు తగ్గుతాయి’ అని భావించినవారి అంచనాలను బంగారం…

ByByVedika TeamApr 16, 2025

Leave a Reply